Friday, March 29, 2024
- Advertisement -

నిజం సినిమాలో నన్ను మోసం చేసి ఆ సీన్స్ తీశారు : రాశీ

- Advertisement -

సీనియర్ హీరోయిన్ రాశీ గురించి అందరికి తెలిసిందే. బాలనటిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన రాశీ.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల్లో సినిమాలు చేసింది. ’పెళ్లి పందిరి’ మూవీతో రాశీ కంప్లీట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వెంటనే పవన్ కళ్యాణ్ సరసన ’గోకులంలో సీత’ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది.

ఇక ‘శుభాకాంక్షలు’ ‘ప్రేయసి రావే’ ‘స్నేహితులు’ వంటి సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత కొత్త భామలు రావడంతో రాశీకి డిమాండ్ తగ్గిపోయింది. ఇది ఇలా ఉంటే ఈమె.. మహేష్ బాబు హీరోగా చేసిన ’నిజం’ మూవీలో రాశీ ఓ స్పెషల్ రోల్ చేసి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆ సినిమాలో గోపిచంద్ తో మితి మీరిన రొమాన్స్ చేయడమే.. ఆ విమర్శలకు కారణం. చాలా షోలలో ఈ పాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో రాశీ క్లారిటీ ఇచ్చింది.

అయితే ఇటీవల ఈమె ‘రాశి విజన్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను స్థాపించి అందులో తన సినీ కెరీర్ కు సంబంధించిన కీలక విషయాల గురించి చెప్పుకొస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు రాశీని ’నిజం’ మూవీలో అంత ఘాటు రొమాన్స్ సీన్స్ లో ఎందుకు నటించారని కామెంట్స్ పెట్టారు. అందుకు రాశి జవాబు ఇస్తూ.. ’డైరెక్టర్ తేజ ’నిజం’ మూవీలో నా పాత్ర గురించి ఒకటి చెప్పి.. మరొకటి తీశాడు. అందుకే ఏం చేయాలేక ఆ బోల్డ్ సీన్స్ లో చేశాను. ఒకరకంగా మోసం చేశారు. ఇష్టం లేకున్న ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని రాశీ చెప్పుకొచ్చింది.

‘పవర్ స్టార్’ సినిమా వల్ల వర్మకి ఎంత లాభామో తెలుసా ?

నా భర్త పెద్ద సైకో.. నన్ను టార్చర్ పెడుతున్నాడు : స్వాతి నాయుడు

ఏమీ పీకలేక.. పీకే మీద పడి ఏడుస్తున్నావ్ : వర్మపై మాధవీలత ఫైర్

ఛాన్స్ ఇస్తానని అమ్మా రాజశేఖర్ నన్ను వాడుకున్నాడు : జబర్తస్త్ పవన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -