Wednesday, April 24, 2024
- Advertisement -

హీరోయిన్ రాశీ కన్నుకు ఏమైంది ?

- Advertisement -

సీనియర్ స్టార్ హీరోయిన్ రాశీ ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల సినిమాల్లో కూడా రాశీ నటించింది. జగపతి బాబు ‘పెళ్లి పందిరి’ సినిమాతో ఈమె రాశీ గా మారింది. ఈ సినిమా హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ సరసన ‘గోకులంలో సీత’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక ‘శుభాకాంక్షలు’ ‘ప్రేయసి రావే’ ‘స్నేహితులు’ వంటి సినిమాలు ఈమె క్రేజ్ ను మరింత పెంచాయి. తర్వాత కొంత కాలానికి ఈమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి.

పెళ్ళైన తరువాత రాశి నటించిన సినిమాలు చాలా తక్కువే. ఈమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అందుకే సినిమాల్లో మళ్లీ నటిస్తుంది అంటూ కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి. కానీ అవన్ని రూమర్స్ అని రాశీ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల రాశీ ఎడమ కన్నుకి అలాగే ముక్కుకి ఏదో ప్రాబ్లం వచ్చింది అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. వీటి పై రాశీ స్పందించింది. ఆమె మాట్లాడుతూ…”నేను హీరోయిన్ గా చేసిన సినిమాల్లో చూసి.. ఇప్పుడు నా ఎడమ కన్ను, ముక్కు ఏదో తేడాగా ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. సినిమా సెట్స్ లో లుక్ కి, ఇంట్లో లుక్ కి చాలా తేడా ఉంది. షూటింగ్ లో పాల్గొనే సమయంలో బాగా నిద్రపోయేదాన్ని. అయితే ఇప్పుడు అలా కాదు. ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి. పైగా ‘శుభాకాంక్షలు’ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. వయసు పెరిగింది కాబట్టి.. అందువల్ల వచ్చిన మార్పులు కావొచ్చు. ఇక నా ముక్కు అంటారా..! సినిమాల్లో నటించేప్పుడు నాకు ముక్కు పుడక వుండేది కాదు.. కానీ మా పాప పుట్టిన తరువాత పెట్టించుకున్నాను. అందువల్ల అది కూడా తేడాగా కనిపిస్తుంది అనుకుంట” అంటూ రాశీ చెప్పుకొచ్చింది.

ప్రభాస్ రేంజ్ ఇది.. 240 కోట్లు రెమ్యునిరేషన్..!

భర్త చనిపోయాడని.. మగాడితో కనిపిస్తే లింక్ పెట్టారు : సురేఖ వాణి

బావమరిది సినిమా కోసం ఎన్టీఆర్ అదిరే ప్లాన్..!

ఆదిపురుష్.. ఇలాంటి సినిమా ప్రభాస్ కెరీర్ లో రాదట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -