వరుణ్ సందేశ్ హీరోగా 2007 లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది విమలా రామన్. ఈ సినిమా ఆశించినంత ఆడకపోయిన.. విమలా రామన్, తన గ్లామర్ తోనూ అలాగే నటనతోనూ ఆకట్టుకుంది. దాంతో ఈమె వరుస ఆఫర్స్ వచ్చాయి.
జగపతి బాబు ‘గాయం2’ మరియు ‘చట్టం’ అలాగే శ్రీకాంత్ తో ‘రంగ ది దొంగ’, సుమంత్ తో ‘రాజ్’, తరుణ్ తో ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’, నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి సినిమాల్లో చేసింది. అయితే ఆఫర్స్ వచ్చాయి కదా అని తన పాత్రకు ప్రాముఖ్యత ఉందో లేదో ఆలోచించకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అవి ఈమెకు మంచి ఫలితాలను అందించలేదు. దాంతో కొన్నాళ్ళ పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తోంది. తాజా ఫొటోల్లో చాలా ట్రెడిషినల్ గా కనిపిస్తుంది. ‘క్లాస్ లుక్. ‘సూపర్ లుక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు మీద కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఈ బ్యూటీ ఇంట్రెస్ట్ చూపిస్తుందట. మన తెలుగు డైరెక్టర్లు ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మాత్రం.. ఈమె కోరిక నెరవేరడం ఖాయమే.
జై చిరంజీవ నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?
అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?