స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా వచ్చిన చిత్రం ’అల..వైకుంఠపురములో’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా.. తమన్ సంగీతం అందించాడు.
అయితే ఈ సినిమాలో ఎక్కువ భాగం ‘వైకుంఠపురం’ అనే హౌస్ లో షూటింగ్ చేశారు. మరి అంత అద్భుతంగా కట్టుకున్న ఆ హౌస్ ఎవరోదో.. ఆ ఇంటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ హౌస్.. తెలుగులో పాపులర్ న్యూస్ ఛానల్తో పాటుగా ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ నడుపుతున్న ఓ మీడియా సంస్థ అధినేత కూతురు సొంత ఇల్లు అని ఫిలింనగర్ టాక్.
అంతేకాకుండా ఆ ఇంటి విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటైన దీనిపై అల్లు అర్జున్ ఎప్పుడో మనసు పారేసుకున్నాడట. ఇంటీరియర్ డిజైనింగ్ చూసి ముచ్చట పడిన బన్నీ.. అలాంటి ఇంటిని ఒకటి నిర్మించే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా వసూళ్ల విషయంలో కూడా దూసుకెళ్తోంది.