Thursday, April 18, 2024
- Advertisement -

అల వైకుంఠ‌పురంలో కోసం టబుకి ఎంత ఇచ్చారంటే ?

- Advertisement -

హీరోయిన్ టబు. గతంలో ఆమె టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెలుగు లోనే కాదు తమిళంలో, హిందీలో కూడా చాలా సినిమాలు చేసి స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం కేవలం ముఖ్యపాత్రలు మాత్రమే పోషిస్తోంది. ఇటివలే తెలుగులో అల వైకుంఠ‌పుర‌మ‌లో సినిమాలో నటించింది.

ఈ సినిమాలో రిచ్ మమ్మీగా ఆమె కనిపించింది. ఈ సినిమాలో ఆమె క‌నిపించింది కాసేపే. కేవలం కొన్ని సీన్స్ లోనే ఆమె కనిపిస్తుంది. కానీ ఆమెకి ఏకంగా రూ.3 కోట్ల పారితోషికం ఇచ్చారట అల వైకుంఠ‌పుర‌మ‌లో నిర్మాతలు. ఆమె హిందీ సినిమాలతో బిజీగా ఉంది. అయిన సరే అల్లు అర్జున్ కోసం అల వైకుంఠపురములో నటించింది. అందుకే మూడు కోట్లు పారితోషకం ఇచ్చారు.

ఇక సరిలేరు నీకెవ్వ‌రు సినిమా కోసం విజ‌య‌శాంతి కూడా ఇంతే తీసుకున్నారట. అయితే సరిలేరు నీకెవ్వరు లో విజ‌య‌శాంతి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె స్థాయికి త‌గిన పాత్రే క‌ట్ట‌బెట్టాడు అనిల్ రావిపూడి. ఏది ఏమైన టబు కేవలం ప‌ది రోజులు కాల్షీట్లు ఇచ్చి, ఏకంగా రూ.3 కోట్లు రాబ‌ట్టుకుంది. దీని బట్టి చూస్తే ఆమెకి తెలుగులో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -