Thursday, April 25, 2024
- Advertisement -

దిల్ రాజుకి, అల్లు అర్జున్ కి మధ్య ఏమైంది ?

- Advertisement -

అల వైకుంఠపురములో రిలీజ్ కాకముందు బన్నీతో ’ఐకాన్’ మూవీని దిల్ రాజు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాని శ్రీరామ్‌ వేణు డైరెక్షన్ లో ఉంటుందని చెప్పాడు. అంతేకాదు ఈ కథ విన్న అల్లు అర్జున్ ఈ సినిమా కచ్చితంగా చేస్తానని చెప్పాడు. సుకుమార్‌ సినిమా కంటే ముందు ఐకాన్‌ మొదలు అవుతుందని కూడా చెప్పాడు. అయితే ఆ చిత్రం చేయాలంటే ‘అల వైకుంఠపురములో’ మాదిరిగా గీతా ఆర్ట్స్‌ని భాగస్వామిగా పెట్టుకోవాలని అల్లు అర్జున్‌ చెప్పాడట.

కానీ మహర్షి అనుభవం తర్వాత మల్టీ ప్రొడ్యూసర్స్‌ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపించట్లేదు దిల్ రాజు. అందుకే మహేష్‌ ఎంత చెప్పినా సరిలేరు నీకెవ్వరుకి కూడా నిర్మాతగా వ్యవహరించలేదు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రిలీజ్‌ క్లాష్‌లో దిల్‌ రాజు ఎక్కువగా మహేష్‌ తరఫునే వుండడం, అతని సినిమాకి ఎక్కువ కలక్షన్లు చూపించడం లాంటివి అల్లు అర్జున్‌కి అసలు నచ్చలేదు. అందుకే దిల్‌ రాజుని తన సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి కూడా ఆహ్వానించలేదు.

దాంతో అల వైకుంఠపురములో మూవీపై మంచి లాభాలు వచ్చినప్పటికి దానిని తన మూవీగా భావించలేదు దిల్ రాజు. సరిలేరు నీకెవ్వరు సక్సెస్‌ మీట్‌లో కూడా అల వైకుంఠపురములో వేరే సినిమా అన్నట్టు, సరిలేరు తన సినిమా అన్నట్టు దిల్‌ రాజు వ్యవహరించాడు. సినీ పరిశ్రమలో ఎక్కువ రోజులు శత్రుత్వం ఉండదు కానీ.. ప్రస్తుతానికి దిల్‌ రాజుకి, అల్లు అర్జున్‌కి అసలు పడటం లేదని సినీ వర్గాల నుంచి తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -