Friday, March 29, 2024
- Advertisement -

ఆడవాళ్లను అనడానికి మీరు ఎవరు ?: అనసూయ ఫైర్

- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ ఇష్యూపై జబర్దస్త్ యాంకర్ అనసూయ స్పందించింది. అయితే చాలా మంది ఈ ఇష్యూపై స్పందించగా అనసుయ స్పందించకపోవడంతో ఆమెపై నెటిజన్లు విమర్శలు చేశారు. దాంతో ఈ ఇష్యూపై రియాక్ట్ అయిన అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. దిశ ఘటనలో రేపిస్టులకు సపోర్టు చేస్తూ కొందరు కామెంట్స్ చేశారు.

వాటి స్క్రీన్ షాట్స్ చూపిస్తూ.. వారిపై విరుచుకుపడింది. ‘సినిమా వాళ్ల వల్లే యూత్ తప్పుదారి పడుతున్నారు. సెక్స్, ఎక్స్ పోజింగ్, బూబ్స్, థైస్ ఇలా ఒక్కటేమిటి.. అన్నీ మొత్తం విప్పిచూపిస్తున్నారు. థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి మీ ఎక్స్ పోజింగ్ చూసి లె****ల్సిందే. లేచాక ఏడ పెడతాడు. ఇదిగో ఇలా రేప్‌లు చేసి ఏడుస్తాడు’ అంటూ జేకే క్రిష్ణ అనే నీచుడు కామెంట్ చేశాడని ఆ స్క్రీన్ షాట్ చూపించింది అనసూయ. ‘దిశ రాత్రి టైంలో బ్యూటీ పార్లర్‌కి ఎందుకు వెళ్లాలి.. వెళ్లకుండా ఉంటే రేప్ జరిగి ఉండదు కదా.. రాత్రి టైంలో కనిపించే సరికి రేప్ చేశారు. ఆ తరువాత మర్డర్ చేశారు. ఇందులో తప్పేం ఉంది’ అంటూ సందీప్ కుమార్ అనే కామాంధుడు కామెంట్ చేశాడని ఆ స్క్రీన్ షాట్ చూపిస్తూ భావోద్వేగానికి గురైంది అనసూయ.

‘దిశను రేప్ చేసిన వాళ్లకు కూడా స్వేచ్ఛ ఉంది. దిశ ఆ టైప్ అని కన్ఫామ్ చేసుకున్న తరువాతే రేప్ చేశారు.. దిశది కూడా తప్పు ఉంది’ అని మరో కామాంధుడు కామెంట్ చేశాడు. అసలు వీళ్లు ఎవరు మమ్మల్ని జడ్జ్ చేయడానికి అంటూ రెచ్చిపోయింది అనసూయ. అసలు ఆడది ఎలా ఉంటే మీకేంటి ? మేం ఏ బట్టలు వేసుకుంటే మీకేంటి ? మీకు ఏ హక్కు ఉంది అని అనసూయ కామెంట్స్ చేసింది. నేను మాట్లాడుతుంటే ఎవడో.. ఏందే నీ గోల అంటున్నాడు.

నేను వాడి ముందు ఉంటే మాటలు కాదు.. ఉచ్చ పడుద్ది వాడికి. కంప్యూటర్ ముందు మాట్లాడటం మగతనమా ? అని తిట్టింది. దిశ ఘటనలో నేను చాలా ఫీల్ అయ్యా. అది మాటల్లో చెప్పలేను. కోపమా? భయమా? బాధా? ఏంటో చెప్పలేను. ట్వీట్ పెట్టి చేతులు దులుపుకోలేను. నేను వీలైనంత ఫాలో అయ్యాను.. ఏం జరుగుతుంది అసలు అని. దీనిపై క్షమాపణ కోరుతున్నా.. వాడకూడని పదాలను వాడితే క్షమించాలి అని అనసూయ మాట్లాడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -