టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తనపై కొన్ని సైట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. విషయంలో విజయ్కు కొందరు స్టార్స్ అండగా నిలుస్తున్నారు. హీరో మహేష్తో పాటు, అల్లరి నరేష్ నీకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. అయితే ఈ విషయంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా వేలు పెట్టింది.
‘మనవరకు వస్తే కాని బుద్ధి రాదన్న మాట…’ అంటూ ఎద్దేవా చేసింది. దీంతో ఆమెను అటు విజయ్ అభిమానులు, ఇటు మహేష్ అభిమానులు ఆడుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో వేలు పెట్టకుండా ఉండాలేవా అంటూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు వెస్తున్నారు. అసలు నువ్వు విరాళం ఇచ్చావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్లో కుళ్లి జోకులు వేసుకో… నీకు ఎందుకు ఇలాంటివి అన్ని అంటూ చురకలు అంటిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎప్పుడూ ట్విట్టర్లోనే ఉంటావా ఏం ఆంటీ అంటూ మరికొందరు నెటిజన్స్ అనసూయను ఏకి పారేస్తున్నారు. మరికొందరు అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ పై తప్పుడు వార్తలు ఎలా వచ్చాయంటే.. తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు విజయ్ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని సైట్లు తప్పుడు కథనాలు ప్రచురించాయని విజయ్ మడిపడుతున్నాడు. విజయ్ దేవరకొండ పేద ప్రజలను అవమానిస్తున్నారని.. వెబ్సైట్ పెట్టి సాయం చేస్తున్నట్టు హంగామా చేస్తున్నారని అనేక వార్తలు రాశాయి. అంతేకాకుండా విజయ్ ఎందుకు విరాళం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూనే, చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)కి పోటీగా మిడిల్క్లాస్ ఫండ్ను విజయ్ ప్రారంభించారంటూ కొన్ని వెబ్సైట్స్ కథనాలు రాశాయి. తప్పుడు కథనాలపై విజయ్ చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ తారలు మద్దతు పలుకుతున్నారు. తాజాగా కాజల్, నాగబాబు కూడా మద్దతు తెలిపిపారు.