Wednesday, April 24, 2024
- Advertisement -

బుల్లితెరపై సందడి చేసిన అనుష్క.. పరువు తీసుకున్న రవి..!

- Advertisement -

బుల్లితెరపై ప్రతీ పండగకు స్పెషల్ గా ఈవెంట్ ప్లాన్ చేస్తుటారు ప్రతి టీవీ చానెల్స్ యాజమాన్యం. అయితే ఎక్కువగా జబర్దస్త్ టీమ్ మాత్రమే ఇలాంటి ఈవెంట్స్ లో కనిపించేవారు. ఈ సారి అదిరింది టీమ్ కూడా ఉగాదికి కనువిందు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే జబర్దస్త్ టీమ్ చేయబోతోన్న పండగ సర్ పండగ అంతే ఈవెంట్ ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

తాజాగా అదిరింది టీమ్ చేసిన ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయింది. బాబు గారి ఇంట్లో బుట్టభోజనం అనే ఈ స్పెషల్ ఈవెంట్‌లో ఫేమస్ కొరియోగ్రఫర్ తరుణ్ భాస్కర్ అతిథిగా విచ్చేశారు. దళపతి సినిమాలోని సింగారాల పైరుల్లోన అనే పాటకు నాగబాబు, తరుణ్ భాస్కర్ ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేశారు. ఇక నిహారిక కూడా ఓ ప్రోమోలో కనిపించింది. తన ఎనర్జీతో పంచ్‌లు వేసింది. కంటెస్టెంట్లకు మాత్రం బెత్తం దెబ్బలు వేస్తూ అదిరిపోయే పంచ్ లు వేసింది. సౌత్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ఎంట్రీతో ఆ ఈవెంట్‌కు మరింత కళ వచ్చింది.

అనుష్క రావడం ఒకెత్తు అయితే బిత్తిరి సత్తి ఎంట్రీ ఇవ్వడం, అనుష్కపై పేరడీ పాట పాడటం, స్వీటీ చేసిన ఉగాది పచ్చడి ప్రదీప్ తినడం ఇలా ప్రోమో అంతా సందడిగా సాగింది. అరుంధతి సినిమాలో పశుపతిలా యాంకర్ రవి ఎంతో ఇంటెన్సిటీ చేయడం, దాన్ని అనుష్క సిల్లీగా తీసుకుని నువ్ నన్ను ఏం చేయలేవురా అంటూ కూరలో కరివేపాకులా తీసిపారేసింది. దాంతో యాంకర్ రవి పరువు తుస్సుమంది. పక్కనున్న ప్రదీప్ పగలబడి నవ్వాడు. జబర్దస్త్ కు పోటీగా అదిరింది టీం చేసిన ఈ ఈవెంట్ పర్వాలేదు అనిపిస్తోంది. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్రోమో మీరు కూడా చూసేయండి.

https://www.youtube.com/watch?v=5fQda4m9UVk

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -