Thursday, April 25, 2024
- Advertisement -

జగన్ తో భేటీకి రానని చెప్పిన బాలయ్య.. కారణం ఇదే..!

- Advertisement -

ఏపీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈనెల 9న టాలీవుడ్ పెద్దలు కలబోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సమాచారం ఉండగా చిరంజీవి అధ్యక్షతన సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు, షూటింగ్స్ అనుమతి, వైజాగ్ లో చిత్ర పరిశ్రమ ఏర్పాటు, అభివృద్ధి వంటి అనేక విషయాలు ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. కాగా ఈ మీటింగ్ కి బాలయ్య మాత్రం హాజరు కావడం లేదు.

బాలయ్యకు ఈ మీటింగ్ గురించి చెప్పి.. ఆహ్వానం పంపగా ఆయన రానని చెప్పారు. ఈనెల 10వ తేదీన బాలకృష్ణ తన షష్ఠి పూర్తి జరుపుకోనున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర ప్రముఖులు హాజరు కానుండగా ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. పుట్టిన రోజు వేడుకల కారణంగా రాలేనని ఆయన చెప్పారు. కాగా బాలయ్య పుట్టిన రోజు వేడుకను సాకుగా చూపి ఈ మీటింగ్ అవైడ్ చేశారని తెలుస్తుంది. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో జరిగిన కొన్ని సమావేశాలకు బాలయ్యను పిలవలేదు.

చిరు అధ్యక్షతన జరిగిన సదరు సమావేశాలకు తనను పిలవకపోవడం పై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పంచుకోవడానికి వీరు సమావేశం అవుతున్నారా అని కొంచెం ఘాటైన విమర్శలు చేశారు. దీనితో పరిశ్రమ వర్గాలలో వివాదం రాజేసుకుంది. జగన్ తో సమావేశానికి అయినా బాలయ్యను పిలిచి దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటే బాలయ్య రానని చెప్పి.. తను ఈ విషయంలో కోపంగా ఉన్నాట్లు చెప్పకనే చెప్పినట్లు అర్దం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -