Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్‌బాస్ పారితోషికం 15 ల‌క్ష‌లు కేర‌ళ‌కు విరాళంగా ఇచ్చిన బాబు గోగినేని

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో హేతువాది అయిన బాబు గోగినేని ఓ సెల‌బ్రిటీగా ద‌ర్శ‌నం ఇచ్చారు.ఈ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్ర‌ల్లో బాగానే పాపుల‌ర్ అయ్యారు బాబు గోగినేని.షో మొద‌ట్లో సైలెంట్‌గానే బాబు గారు షో న‌డుస్తున్న కొద్ది తాను కూడా ఎమోష‌న్స్‌కు అతీతుడిని కాద‌ని నిరుపించాడు.కౌశ‌ల్‌తో గొడ‌వ పడి బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు బాబు గోగినేని.ఆయనకు బిగ్ బాస్ షో ద్వారా సుమారు 15 లక్షల పారితోషికం లభించినట్టు తెలుస్తుంది.

తనకు వచ్చిన మొత్తం పారితోషికాన్ని కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చేశారట.కేరళ వరదల కారణంగా అక్కడ ఉన్న పరిస్థితులకు చలించిన బాబు గోగినేని తనకు బిగ్ బాస్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును CM రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేశారని తెలుస్తుంది.ఆయ‌నే నేరుగా కేర‌ళ ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌రికి వెళ్లి 15 ల‌క్ష‌ల చెక్‌ను అంద‌జేశార‌ని స‌మాచారం.మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -