Friday, April 19, 2024
- Advertisement -

బిగ్ బాస్ 3 విన్నర్ : అప్పుడు కౌశల్.. ఇప్పుడు బాబా.. ?

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. వివాదాలు, గొడవలు ఒకరిపై ఒకరు మాటల యుద్దాలతో నడుస్తోంది. ఇటివలే పునర్నవి, రాహుల్ బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ బాగా నడిచింది. ఆ తర్వాత పునర్నవి ఎలిమినేట్ కావడంతో రాహుల్ ఒంటరి వాడు అయ్యాడు. కానీ గేమ్ లో మాత్రం ఎక్కడ తగ్గకుండా ఆడుతున్నాడు. మహేష్ విట్టా ఇటీవలే ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. అందరు ఇప్పుడు నామినేట్ లోనే ఉన్నారు.

ఇక తరుచుగా రాహుల్ ,శ్రీముఖి గొడవ పడుతున్నారు. ఏ చిన్న విషయం అయిన సరే వీరి మధ్యకి వస్తే అది పెద్ద వివాదంగా మారుతోంది. ఇక వరుణ్ సందేశ్ తన భార్య వితికను ఎలిమినేట్ కాకుండా కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ సందర్భంలో వితిక కోసం శివజ్యోతితో కూడా గొడవ పడ్డాడు. ఇటీవలే సభ్యుల బంధువులను ఇంటిలోకి పంపుతున్నాడు బిగ్ బాస్. అలీ భార్య వచ్చింది. ఆమెని చూసి అలీ తెగ ఏడ్చాడు. ఇక శివజ్యోటి భర్త కూడా వచ్చాడు. ఆమె అతన్ని చూడగానే వెంటనే కన్నీళ్లు పెట్టుకుని అతని హత్తుకుంది.

వితిక చెల్లెలు కూడా హౌస్ లోకి వచ్చింది. అలానే బాబా మాస్టర్ పిల్లలు, భార్య వచ్చారు. ముందు పిల్లలు వచ్చి బాబాను హత్తుకున్నారు. పిల్లలను చూడగానే బాబా ముఖం వెలిగిపోయింది. ఆ తర్వాత తన భార్య కూడా వచ్చి బాబాకు సర్ప్ రైజ్ చేసింది. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ 2 సీజన్ లో కౌశల్ పిల్లలు, భార్య వచ్చారు. మిగిత సభ్యుల పిల్లలు రాలేదు.

ఇప్పుడు మూడో సీజన్ లో కూడా మిగిత సభ్యుల పిల్లలు ఎవరు రాలేదు. బాబా పిల్లలు మాత్రమే వచ్చారు. అప్పుడు కౌశల్ విన్నర్ అయ్యాడు. మరి ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో బిగ్ బాస్ బాబా కోసం పిల్లలను పంపించాడా ? బాబా మస్టారే బిగ్ బాస్ విన్నర్ అని హిట్ ఇస్తున్నాడా ? అని సోషల్ మీడియాలో ఈ రకంగా కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైన బాబా మాస్టర్ తన ఆట తాను ఆడుతూ మంచి ఓట్లు గెల్చుకుంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -