పెద్ద నోట్ల రద్దు తరవాత ప్రజల్లో మోడీ పట్లా ఆయన ప్రభుత్వం పట్లా వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కొన్ని విశ్లేషణలు వచ్చాయి . అవన్నీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందర సంగతి. ఆ తరవాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో , పంజాబ్ తప్ప ఇతర ప్రాంతాల్లో తమ హవా చాటుకుంది బీజేపీ పార్టీ.
ఒకవైపు అఖిలేష్ , ములాయం లాంటి పాతుకుపోయిన పార్టీలు ఉన్నా , కాంగ్రెస్ తో వారు జత కలిసినా మోడీ హవా మామూలుగా సాగలేదు. ఉత్తర ప్రదేశ్ లో ఆయనకి ఘన విజయం అందించిన ప్రజలకి కరన్సీ కష్టాలు లేకుండా చూసుకున్నారు మోడీ. మొదటి నుంచీ ఆయన ఇదే కాన్సెప్ట్ మీద నడిచారు. ఈ ఎన్నికల్లో గెలిచినా ఉత్సాహం లో ఉన్న ఆయన కరన్సీ కొరత ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కి ఆశావాహ పరిస్థితి ఉన్నా కూడా మినిమం కేర్ చెయ్యలేదు అని వాదన ఉంది. యూపీ లో గెలిచిన వెంటనే అయోధ్య రామమందిరం విషయం గురించి బీజేపీ మళ్ళీ ప్రస్తావించడం షాకింగ్ గా ఉంది. సర్దుకున్న విషయాన్ని స్వయంగా మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతున్నారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి.