బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దానిపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాలీవుడ్ పైకి కనిపించేంత అందంగా ఉండదని.. అక్కడ వ్యక్తుల మనసులు అందంగా ఉండవని అంటున్నారు. ఇదే అంశంపై తాజాగా నటి శ్రద్దా దాస్ పలు విషయాలు తెలిపింది.
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనివారు బాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం అని శ్రద్దా తెలిపింది. మధ్య తరగతి నుంచి వచ్చిన వారు ఇండస్ట్రీలో ఎదగలేరని స్పష్టం చేసింది. నిలబడాలంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాలని చెప్పింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలంటే పార్టీలకు వెళ్లాలని.. బాంద్రా, జుహూ ప్రాంతాల్లో ఉండే ఖరీదైన క్లబ్ లకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది. అక్కడున్న వారితో స్నేహంగా మెలగాలని తెలిపింది. మేల్ యాక్టర్లకు కూడా ఇవే ఇబ్బందులు ఉంటాయని చెప్పింది.
పీఆర్ మేనేజర్లకు డబ్బులు ఇవ్వడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని… డబ్బు తీసుకుని వారు చెప్పేది కూడా ఇదేనని చెప్పింది. వారు కూడా పార్టీలకు వెళ్లమనే సూచిస్తారని తెలిపింది. దుస్తులు, షూస్, సెలూన్, స్టయిలిస్ట్, పీఆర్, కార్లు తదితర ఖర్చులను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాళ్లు భరించలేరని చెప్పింది. వీటన్నిటిని మెయిన్టైన్ చేయడం చాలా కష్టమని.. కొన్నిసార్లు ఈ రంగంలోకి ఎందుకు వచ్చామా ? అని అనిపిస్తోందని తెలిపింది.
శ్యామ్.కే నాయుడి చాలా నష్టపోయాను : సాయి సుధ
శ్రీదేవి డబ్బుల కోసం కుట్ర జరిగింది : శ్రీదేవి మేనమామ