Thursday, March 28, 2024
- Advertisement -

అఖిల్ కొత్త సినిమా ఉన్నట్టా…? లేన్నట్టా..?

- Advertisement -

ఒంగోలు గిత్త తరువాత తెలుగు లో పెద్దగా సినిమాలు చేయని బొమ్మరిల్లు భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని అఖిల్ అక్కినేని తో చేయనున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమా ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి.

తాజా ఫిలిమ్ నగర్ సమాచారం మేరకు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమా కి సంబంధించి సెకండ్ హాఫ్ ఇంకా పూర్తి చేయలేదు అట. ఈ సినిమా గురించి ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్న భాస్కర్ సెకండ్ హాఫ్ చేయటం లో చితికీల పడ్డాడు అని తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదలు కానున్న దశలో ఇంకా సెకండ్ హాఫ్ పూర్తి కాలేదు అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టే విషయమే. సాధారణం గా నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ లాక్ అవ్వనిదే షూటింగ్ మొదలు పెట్టడు. అలాంటిది అంతా అనుకోని మీడియా లో వార్తలు వచ్చిన తరువాత ఇంకా సెకండ్ హాఫ్ పూర్తి కాలేదు అంటే ఏం చేస్తాడు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే భాస్కర్ ముందుగా రాసుకున్న సీన్ల షూటింగ్ అయిన తరువాత అప్పుడు మిగిలిన సీన్ల గురించి ఆలోచిద్దాం అనే దోరణిలో ఉండగా అల్లు అరవింద్ మాత్రం దానికి ససేమీరా అంటునట్లు తెలుస్తుంది. చివరికి ఇది ఎం అవుతుందో కొన్ని రోజులు అయితే మనకే తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -