- Advertisement -
అఖిల్ తీసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో తన తరువాత సినిమా స్టోరీపై ఫోకస్ పెట్టాడు. సీనియర్ డైరక్టర్లలను నమ్ముకుంటే పరిస్థితి మరి దారుణంగా ఉందని యువ దర్శకులను నమ్ముకుంటే మేలు అని గ్రహించాడు అఖిల్. అందుకే తన తరువాత సినిమా తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరిని దర్శకుడిగా తీసుకున్నాడు.ఇటీవల ఈ దర్శకుడు చేసిన ‘తొలిప్రేమ’ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
అందువల్లనే ఆయన దర్శకత్వంలో చేయడానికి అఖిల్ ఉత్సాహాన్ని చూపించాడు. అఖిల్ తో కూడా ఆయన యూత్ కి కనెక్ట్ అయ్యే కథనే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది పేర్లు వినిపించిన చివరికి నిధి అగర్వాల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అఖిల్ మూవీలోని పాత్రకి ఈ అమ్మాయి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం చైతూ సరసన ‘సవ్యసాచి’ సినిమా చేస్తోంది.