ఇటీవలే హీరో రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు. మా తండ్రి కండిషన్ క్రిటికల్ గా ఉంది.. అందరు ప్రార్ధించండి అని రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఓ లేఖ రాశారు. ఆ టైములో ‘తన స్నేహితుడైన రాజశేఖర్ త్వరలోనే కోలుకుంటారు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి.. శివాత్మిక ట్వీట్ కు రిప్లై ఇచ్చారు.
అయితే చిరు ట్వీట్ చేసి ఊరుకున్నారు అనుకుంటే పొరాపాటే..
రాజశేఖర్ కోసం చిరు చాలా చేశారట. వివారాల్లోకి వెళ్తే.. చిరంజీవి తన కోడలు ఉపాసన రికమండేషన్ తో.. అపోలో హాస్పిటల్ వైద్యులను పిలిపించి రాజశేఖర్ కు మంచి వైద్యం ఇవ్వాలని కోరారట. దాంతో సీనియర్ డాక్టర్లు రాజశేఖర్ త్వరగా కోలుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రస్తుతం రాజశేఖర్ బాగానే ఉన్నారని ఆయన కూతురు శివాత్మిక తెలిపారు.
డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కు ఆయన స్పందిస్తున్నారని కూడా ఆమె తెలిపింది. ఇంకో రెండు రోజుల్లో రాజశేఖర్ మాములు అవుతారని తెలుస్తోంది. గతంలో చిరు, రాజశేఖర్ మధ్య చిన్న మాటల యుద్ధం జరిగినప్పటికీ.. ఆ తరువాత వెంటనే కలిసిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏది ఏమైన సరే.. రాజశేఖర్ కోసం చిరు ముందుకు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.
‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!
హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?