Thursday, April 25, 2024
- Advertisement -

భర్త ఫోటోలను డిలీట్ చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకు ?

- Advertisement -

హీరోయిన్ స్వాతి.. ఈమె 17ఏళ్లకే బుల్లి తెరపై తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. కొన్ని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా చేస్తూ మంచి పాపులరిటీ సంపాధించుకుంది. ఆమె చేసిన షోస్ లో కలర్స్ షో బాగా సక్సెస్ కావడంతో ఆమెకి కలర్స్ స్వాతి అని పేరు వచ్చేసింది. తర్వాత చిన్నగా సినిమాలవైపు అడుగులు వేసింది. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ డేంజర్ లో ఓ హీరోయిన్ గా చేసింది.

ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే సినిమాలో సైడ్ రోల్ చేసింది. ఈ సినిమాలో పాత్రకు మంచి పేరు వచ్చింది. ఐతే నాని డెబ్యూ మూవీ అష్టా చెమ్మా మూవీ ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టింది. ఆ సినిమాలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు తో పాటు, నంది అవార్డు గెలుచుకుంది. నిఖిల్ తో ఈమె చేసిన స్వామి రారా, కార్తికేయ సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. తెలుగు తమిళ భాషలలో 30కి పైగా సినిమాలలో స్వాతి నటించింది. 2018 ఆగస్టు 30న మలయాళీ పైలట్ వికాస్ వాసుని ప్రేమ వివాహం చేసుకుంది స్వాతి. ఐతే వీరి వివాహం బంధంలో ఒడిడుకులు వచ్చాయేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వీరు విడకుల వైపు వెళ్తున్నారనే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. పెళ్లి తరువాత విదేశాలలో ఉంటున్న స్వాతికి ఆమె భర్తకు అసలు పొసగడం లేదనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోటోలు డిలీట్ చేయడాన్ని లేవనెత్తున్నారు. స్వాతి ఎందుకు పెళ్లి ఫోటోలను అకౌంట్ నుండి డిలీట్ చేసిందని అనుమానం అందరిలో వ్యక్తం అవుతోంది. మరి ఈ పుకార్లలలో నిజం ఎంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -