Saturday, April 20, 2024
- Advertisement -

కొరటాల శివ మీద ఆగ్రహంగా ఉన్న మెగా ఫాన్స్..?

- Advertisement -

అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ.. తొలి సినిమా నే ప్రభాస్ లాంటి పెద్ద హీరో తో చేసి సూపర్ హిట్ సాధించాడు.. ఆ తరువాత మెష్ శ్రీమంతుడు, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయనకు స్టార్ ఇమేజ్ స్టేటస్ వచ్చేసింది.. రచయితగా ఆయనకు మంచి అనుభవం ఉండడంతో కొరటాల డైరెక్టర్ గా యిట్టె సక్సెస్ అయ్యాడు.. ఇక ఆయన సినిమా ల్లో వాణిజ్యాంశాలతో పాటు సామజిక అంశాలు కూడా ఉంటాయని అందరికి తెలిసిందే..

కమర్షియాలిటీ తో పాటు మెసేజ్ ను కూడా జొప్పించడం ఆయనకే చెల్లింది.. ఇక కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా కి సంబందించిన మోషన్ పోస్టర్ ఇటీవలే మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భగా విడుదల కాగా మెగా ఫాన్స్ ఆ పోస్టర్ కి ఎంతో ఆదరణ అందించారు. ఇక అంతా బాగానే ఉంది. సినిమా షూటింగ్ చేసి ఎంతో త్వరగా సినిమా రిలీజ్ చేయాలి అని కొరటాల శివ భావిస్తున్న సమయంలో సడెన్ గా ఈ కథ నాది అంటూ ఓ రచయిత వచ్చి ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనం గా మారింది.

రాజేష్ మండూరి అనే ఓ రచయిత తన కథే అని చెప్తూ యా కథ తో నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలిసాడని పూసగుచ్చిగా వివరిస్తున్నాడు.. దీంతో కొరటాల శివ పై అనుమానాలు పెంచుతున్నాయి.. అయితే రాజేష్ ఇటీవలే కొరటాల ని కలిసి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే కొరటాల శివ ఇద్దరి కథలు కొంచెం అటు ఇటుగా ఒకేలా ఉన్నాయని చెప్పగా అది రాజేష్ మీడియా ముందుకు వచ్చి బలంగా చెప్తున్నాడు.. దాంతో ఈ కథ తనదే అన్న వాదన ను అయన బలంగా లేవనేత్తుతున్నాడు.. అయితే కొరటాల అభిమానులు మాత్రం కొరటాల శివ కు కాపీ చేయాల్సిన అవసరం లేదు. అయన దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ గా ఉంటాయి అని అంటున్నారు.. మరోవైపు మెగా అభిమానులు కొరటాల శివను మెగా స్టార్ సినిమా చేస్తున్నావు.. తొందరగా అది క్లియర్ చేసుకో అని కొంచెం హెచ్చరిక లు జారీ చేస్తునట్లు చెప్తున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -