Saturday, April 20, 2024
- Advertisement -

కరోనా వల్ల హీరోయిన్స్ పరిస్థితి ఇది..!

- Advertisement -

కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ కు వెళ్ళాయి. దాంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా మూతపడ్డాయి. అటు సినిమా రంగం కూడా కరోనా దెబ్బకు మూతపడింది. ప్రస్తుతం ఎలాంటి షూటింగ్‌లు జరగకపోవడంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

అయితే ఈ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ భారీ నష్టాలను తీసుకురావడం ఖాయమని కొందరు అంటున్నారు. అటు సినిమా రంగంలోని పలువురు స్టార్స్ ఈ కరోనా దెబ్బకు కనిపించకుండా పోనున్నారట. ముఖ్యంగా ఫేడవుట్ అవుతున్న హీరోయిన్లకు కరోనా దడ పుట్టిస్తోంది.అసలే అరొకర అవకాశాలు వస్తున్న వీరికి కరోనా మహమ్మారి చుక్కలు చూపిస్తోందట.ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన చాలా మంది పేరు ఉంది.

ముఖ్యంగా హెబ్బా పటేల్, శ్రద్ధా దాస్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా, అను ఇమ్మాన్యుయెల్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని ఇప్పుడు తెలుగు, దర్శక నిర్మాతలు కేవలం కేమియో పాత్రల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ తరువాత పరిస్థితి మారుతుందని, వీరికి భారీమొత్తం చెల్లించి నష్టపోయే కంటే కొత్తవారిని తక్కువ రేటుకు పట్టుకు రావచ్చని అలోచిస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -