Thursday, April 18, 2024
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్న ప్రభాస్..!

- Advertisement -

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ’రాథే శ్యామ్’ అనే పీరియాడికల్ లవ్ డ్రామా సినిమాని చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు మరో రెండు ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ’వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న 50 వ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే తన 22వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మైతిలాజికల్ సోషియో ఫాంటసీకి ‘ఆది పురుష్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉండగా.. ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణా మూవీస్’ వారు నిర్మిస్తుండగా..ఈ ప్రాజెక్టు కు 250కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం.

ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బడ్జెట్ 400కోట్ల వరకూ అవుతుందట. ఇక ‘ఆది పురుష్’ చిత్రానికి 600 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని సమాచారం. సో మొత్తంగా ఈ 3 సినిమాలకు కలిపి 1000 కోట్ల పైనే బడ్జెట్ అవుతుంది. దట్ ఈజ్ ప్రభాస్ రెంజ్ అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

రాహుల్ తో పునర్నవి పెళ్లి చేసేశారు.. అదిరిందిపో..!

కాస్టింగ్ కౌచ్‌ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్..!

నిహారిక నిశ్చితార్థానికి బాబాయ్ పవన్ ఎందుకు రాలేదో తెలుసా ?

నిహారిక ఎంగేజ్మెంట్ లో స్పెషల్ గా ఎట్రాషన్ గా నిలిచిన బన్నీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -