Friday, March 29, 2024
- Advertisement -

పూరికి ఇస్మార్ట్ షాక్ ఇచ్చిన దిల్ రాజు

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా ని స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ మొత్తానికి థియేటర్ల లో రిలీజ్ చేసే స్థితికి సినిమా ని తీసుకొని వచ్చాడు. ఈ నెల 18 న ఈ సినిమా విడుదల కానుంది అని ప్రకటించిన పూరి ఏ విధం గా అయినా సినిమా కి మంచి బజ్ ని తీసుకొని రావాలి అనే కృషి తో పని చేస్తున్నాడు.

రామ్ పోతినేని, నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ ఈ సినిమా లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన డిజిటల్, సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి కానీ సినిమా కి సంబందించిన థియాట్రికల్ రైట్స్ మాత్రంఇంకా అమ్ముడుపోలేదు అని టాక్. నైజాం లో మంచి పలుకుబడి ఉన్న దిల్ రాజు ఈ సినిమా ని పంపిణీ చేస్తాడు అని భావించి యూనిట్ అతన్ని అప్రోచ్ కాగా దిల్ రాజు చేతులెత్తేసినట్టు సమాచారం.

తన ముందు ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయని, తాను ఈ సినిమా కొనలేనని చెప్పేశాడట. కాకపోతే పూరి ని వేరే అషన్స్ ట్రై చేయమని,ఎవ్వరూ ముందుకు రాకపోతే నైజాం లో వైజాగ్ లో అడ్వాన్స్ ఇవ్వకుండా పంపిణీ చేస్తా అని మాట ఇచ్చాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -