Saturday, April 20, 2024
- Advertisement -

పవన్, అలీ మధ్య దూరం పెరిగిందా ?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ తల్లి జైతున్ బీబీ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. తల్లి అంటే అలీకి ఎంతో ప్రేమ. ఆవిడ గొప్పతనాన్ని కూడా పలు సందర్భాల్లో అలీ చెప్పుకొచ్చారు. అయితే అలీని ఓదార్చడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు అందరూ అతని నివాసానికి వచ్చి వెళ్ళారు. అలీ తల్లి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ కూడా హాజరయ్యారు.

అయితే అలీకి బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. ఈ విషయం పై పవన్ ను చాలా మంది ట్రోల్ చేస్తూ వచ్చారు. ‘రాజకీయ మనస్పర్థలు వల్లే పవన్ రాలేదు’ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కామెంట్స్ సరికాదు అంటూ సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు ఇమంది రామారావు ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ..” అలీ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లలేదనేది చాలా చిన్న విషయం. కావాలనే దీన్ని చాలా పెద్దది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్తే.. అలీని చుడగానే ఎమోషనల్ అవుతారు. వెంటనే ఆలీ బోరున ఏడుస్తారు. వారి మధ్య అలాంటి బంధం ఉంది. తన తల్లి చనిపోయిన పవన్ కళ్యాన్ ఎందుకు రాలేదో.. అలీ కూడా అర్దం చేసుకుంటాడు. పవన్ చాలా సందర్భాల్లో తనకు అలీ ప్రత్యేకమైన స్నేహితుడని చెప్పాడు. చిరంజీవి.. అలీని పరామర్శించారు కాబట్టి పవన్ ఎందుకు వెళ్ళలేదు అనే విషయాన్నే హైలైట్ అవుతుంది. అయితే ఇండస్ట్రీలో పేరున్న చిరంజీవిగారు కాబట్టి పెద్ద మనిషిగా వెళ్ళారు. సో పవన్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు” అని ఆయన చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -