Saturday, April 20, 2024
- Advertisement -

క్రిష్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు గా

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో టాలెంట్ కి కొదవ లేదు. మన దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టి సినిమాలు తీయాలి కానీ ప్రతి చిత్రం బాహుబలి అవ్వక మానదు. ఇప్పటి వరకు అనేక మంది దర్శకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి టాప్ ఫామ్ తో ముందుకు వెళ్లారు. అయితే అందులో క్రిష్ కూడా ఉంటాడు. గమ్యం సినిమా తో తెరంగేట్రం చేసి ఆ తర్వాత కొన్ని ప్రేక్షాధారణ పొందిన సినిమాలకి పని చేశారు క్రిష్. బాలకృష్ణ తో గౌతమి పుత్ర శాతకర్ణి తీసాక క్రిష్ మీద అందరికీ గౌరవం అమాంతం పెరిగి పోయింది.

అయితే ఆ తర్వాత క్రిష్ తీసిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్. హిందీ కి వెళ్ళి కంగనా తో మణికర్ణికా అనే సినిమా చేసినా కానీ ఆ సినిమా అనేక వివాదాల లో కి దూసుకెళ్లింది. అంతే కాకుండా క్రిష్ కూడా కంగనా తో అనవసరమైన గొడవ కి దిగాల్సిన పరిస్థితి ని తెచ్చుకున్నాడు. ఇక ఇటు తెలుగు లో బయోపిక్ ఎలాగో నిరాశ పరచడం తో క్రిష్ మీద ఒకేసారి పడిపోయారు క్రిటిక్స్.

తెలుగు మరియు హిందీ క్రిటిక్స్ ఒకేసారి క్రిష్ మీద విమర్శల వెల్లువ చేశారు. అన్ని రోజులు క్రిష్ సైలెంట్ గా నే ఉంటూ విమర్శల ని తీసుకున్నాడు. అయితే ఇటీవలే తెల్సుకున్న సమాచారం ప్రకారం క్రిష్ తాను ఇంకొక రాంగ్ మూవ్ వేస్తే తిట్టిపోయడానికి జనాలు రెడీ గా ఉన్నారు అని అన్నాడట. అయితే ఒక రాంగ్ మూవ్ వేసాను అని ఒప్పుకున్నా క్రిష్ అది మణికర్ణికా నా లేక ఎన్టీఆర్ బయోపిక్ ఆ అనే క్లారిటీ మాత్రం మిస్ చేసాడు.

ఇదంతా పక్కన పెడితే ఇంకా క్రిష్ తన తదుపరి చిత్రం మీద ఒక క్లారిటీ కి వచ్చినట్టు లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -