Tuesday, April 23, 2024
- Advertisement -

టైం అడిగిన క్రిష్.. వేరే సినిమా కు వెళ్ళిన పవన్..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాడు.. వకీల్ సాబ్ సినిమా ని ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధం చేసిన పవన్ మిగితా సినిమాలను ఇంకా మొదలుపెట్టలేదు.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పిరియాడికల్ సినిమా కి ఇంకొంత టైం పట్టేలా ఉంది.. హరీష్ శంకర్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించట్లేదు.. దాంతో పవన్ ఫోకస్ మొత్తం వకీల్ సాబ్ మీదే ఉన్నట్లు అర్థమవుతుంది.  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగ పవన్ హీరోయిజానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమా ని రూపొందిస్తున్నారు.. తొలిసారి పవన్ సినిమా కి సంగీతం వహిస్తున్నారు తమన్..

ఇక ఈ సినిమా తర్వాత చేయబోయే క్రిష్ సినిమా ను పవన్ తాత్కాలికంగా ఆపేసినట్లు తెలుస్తుంది..అందుకు కారణం లేకపోలేదట..ఈ సినిమా ని మొదలుపెట్టడానికి  క్రిష్ కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పాడత..దాంతో పవన్ ఈ గ్యాప్ లో ఇంకో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడట.. క్రిష్ తన పని పూర్తి చేసుకునే లోగా అయ్యప్పనుం కోషియం రీమేక్ ని చేయాలనీ పవన్ ఆలోచిస్తున్నాడట..

రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఎట్టకేలకు పవన్ ని ఒప్పించినట్టుగా సమాచారం. మరో హీరో క్యారెక్టర్ కోసం రానా ఇంతకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ ఉంది. అయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్ లో పూర్తి చేయగలిగే అవకాశం ఉన్న సినిమా. ఏ అరకులోనో పొల్లాచ్చిలోనో లేదా గోదావరి జిల్లాల్లోనో ఈజీగా తీసుకోవచ్చు. క్యాస్టింగ్ కూడా భారీగా అవసరం లేదు. ఆ రెండు పాత్రల మధ్యే ఎక్కువ కథ సాగుతుంది. ఇక  అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కోసం సాగర్ చంద్ర, బాబీ ఇలా ఓ రెండు మూడు పేర్లు పరిశీలనలో పెట్టుకుంది సితార. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేని పరిస్థితి.

ధృవ వర్జినల్ దర్శకుడితో రామ్ చరణ్ తేజ సినిమా..?

పవన్ ఫ్యాన్స్ ఊహించని గుడ్ న్యూస్..!

విజయ్ తమ్ముడికి బాగానే ఖర్చు పెట్టారుగా..?

పెళ్లి వరకు వచ్చి విడిపోయిన సెలబ్రిటీస్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -