Wednesday, April 24, 2024
- Advertisement -

మెగా మేనల్లుడి సెలక్షన్ పై అభిమానుల అసంతృప్తి

- Advertisement -

2016లో ‘సుప్రీమ్’ సినిమా హిట్ అయిన తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2018 వరకు అరడజను సినిమాల్లో నటించాడు కానీ అందులో ఒక్క సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. వరుసగా అన్ని డిజాస్టర్ లు అందుకున్న సాయి ధరంతేజ్ ఎట్టకేలకు ఈ మధ్యనే కిషోర్ తిరుమల దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘చిత్రలహరి’ తో మంచి హిట్ ను అందుకున్నాడు. నిజానికి సినిమా బ్లాక్ బస్టర్ అనడానికి లేదు. ప్రేక్షకుల నుంచి ‘చిత్ర లహరి’ సినిమా కి మంచి ఆదరణ లభించినప్పటికీ, కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమంత హడావిడి చేయలేదు.

అయితే వరుసగా సాయి ధరంతేజ్ సినిమాలు డిజాస్టర్ అవడానికి గల కారణాల్లో ఒకటి తేజ్ దర్శకుల సెలక్షన్. వివి వినాయక్, కృష్ణవంశీ, బీవీఎస్ రవి, గోపీచంద్ మలినేని, కరుణాకరన్ వంటి సినిమాలకు ఫాం లో లేని దర్శకులతో సాయి ధరంతేజ్ సినిమాలు చేశాడు. అయితే ఆ తర్వాత కూడా తేజ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సాయి ధరంతేజ్ ఈ మధ్యనే సుబ్బు అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇలా ఫామ్ లో లేని దర్శకులతో సాయి ధరంతేజ్ సినిమాలు చేయడం ఎప్పుడు మానేస్తాడా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -