Thursday, April 25, 2024
- Advertisement -

మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరి బెదిరించిన దుండగులు..!

- Advertisement -

మోహన్‌ బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్లి.. అందులో నలుగురు మైకంలో ఉన్న కుర్రాళ్లు దిగి మిమ్మల్ని వదలమంటూ నానా రచ్చ చేశారు. ఇలాంటి బెదిరింపులు మంచు ఫ్యామిలీకి కొత్తేమి కాదు. ఇంతకీ ఆ బెదిరింపులు జారీ చేసిన దుండగులు ఎవరంటే… మంచు ఫ్యామిలీ శంషాబాద్ లో కట్టుకున్న ఇంటి పక్కన స్ధలం ఉన్నవారు అట. స్థలం విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం లేకపోయినా.. ఆ స్థలానికి వెళ్లే దారి విషయంలో తేడా వచ్చిందని.. దాంతో మమ్చు ఫ్యామిలీపై ఆ స్థలం తాలుకూ వ్యక్తులు కోపం పెంచుకున్నారని.. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తుల పిల్లలే మంచు ఇంటిలో దూరి హెచ్చరించి వెళ్లారని తెలుస్తోంది.

వారి బెదిరింపులకు భయపడిన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. అయితే ఇందులో మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ ప్రమేయం కూడా ఉందని అంటున్నారు. అతను ఆ రోజు కావాలనే జాగ్రత్తగా లేడట. భారీ గేటు నుండి ఒక ఇన్నోవా కారు లోపలకి రావాలంటే వాచ్ మెన్ గేటు తీయాలి. కారులో వాళ్లు దుండగులు అని, తాగి ఉన్నారని క్లియర్ గా తెలిసిన తరువాత కూడా వాచ్ మెన్ గేటు ఎందుకు తీశాడని మంచు ఫామిలీ అతని పై సీరియస్ అయింది.

ఇక కారులో ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మోహన్‌బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత అవసరం, ఆ స్థాయి శత్రువులు ఎవరా అని ఆలోచిస్తున్న క్రమంలో వీళ్ళ గురించి తెలిసి దొరికిపోయారు. ఏది ఏమైనా ఆ ఆకతాయిలు మోహన్‌బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో రాకపోయినా.. వారు చేసింది తప్పే కాబట్టే వారిపై చర్యలు తీసుకుకోవాలని మంచు ఫ్యాన్స్ అంటున్నారు.

నిజం సినిమాలో నన్ను మోసం చేసి ఆ సీన్స్ తీశారు : రాశీ

‘పవర్ స్టార్’ సినిమా వల్ల వర్మకి ఎంత లాభామో తెలుసా ?

ఛాన్స్ ఇస్తానని అమ్మా రాజశేఖర్ నన్ను వాడుకున్నాడు : జబర్తస్త్ పవన్

నా భర్త పెద్ద సైకో.. నన్ను టార్చర్ పెడుతున్నాడు : స్వాతి నాయుడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -