Friday, April 19, 2024
- Advertisement -

థమన్ ను మళ్లీ ఏసుకుంటున్నారు.. ఏం జరిగింది ?

- Advertisement -

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు మంచి క్రేజ్ ఉంది. స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లాంటి వారు ఈ మధ్య థమన్ ను తమ సినిమాలకు పెట్టుకుంటున్నారు. అలా ’అరవింద సమే” సినిమాతో త్రివిక్రమ్, థమన్ జర్నీ స్టార్ట్ అయింది. ఇటీవలే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన “అల వైకుంఠపురములో” కూడా థమన్ సంగీతం అందించాడు.

అయితే ముందు నుంచి థమన్ సాంగ్స్ ను కాపీ చేస్తాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ట్యూన్స్ ఎక్కడెక్కడి నుంచో కాపీ కొట్టి తెస్తాడని చాలా పెద్ద రచ్చే నడిచింది. తాజాగా అలాంటే ట్రోల్సే థమన్ పై మరోసారి పడుతున్నాయి. తాజాగా అల వైకుంఠపురములో రాములో రాముల ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఓ టీవీలో ప్రసారం చేసిన పాటల ప్రోగ్రాంలో ఒకావిడ ఇలాంటి ట్యూన్ తోనే పాట పాడారు అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో ఒక్కొక్కరు ఒక్కో రకంగా థమన్ పై విరుచుకుపడుతున్నారు.

కాపీ సాంగ్ అని తెలియక ఇప్పటిదాక థమన్ పై మంచి మ్యూజిక్ ఇస్తాడని నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఇప్పుడు పోయిందని థమన్ సాంగ్స్ ని ఇష్టపడే వారు అంటున్నారు. ఇక మిగితవారు థమన్ ఇప్పటికైన కాపీ చేయకుండా ఉంటే బేటర్ అని సలహ ఇస్తున్నారు. ఏది ఏమైన రాములో రాముల సాంగ్ సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ సాధించిన సాంగ్ గా రికార్డు ఎక్కింది. ఇక ఈ పాటకు కాపీ ఎక్కడ నుంచి కొట్టాడో మీరు కూడా ఓ సారి చూడండి.

https://www.youtube.com/watch?v=tuU5o7kwJGg

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -