Thursday, April 25, 2024
- Advertisement -

సమంతను అక్కినేని కుటుంబమ్ టార్చర్ చేస్తుందా ?

- Advertisement -

సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. విభిన్నమైన సినిమాల్లో ఎప్పుడు చేయని పాత్రలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటుంది. దాంతో ఆమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత ఇచ్చిన స్టేట్ మెంట్ ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జాను ప్రమోషన్ లో భాగంగా సమంత చేసిన కామెంట్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని నిరాశ కు గురి చేస్తున్నాయి.

తాను మరో రెండు మూడేళ్లు మాత్రమే నటిస్తానని.. ఆ తర్వాత ఎలా వుంటుందో తెలియదని సామ్ చెప్పింది. నాకు పెళ్లైంది.. నా ఫ్యామిలీ గురించి కూడా చూసుకోవాలి కదా.. హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది అన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే నా కెరీర్ ఇంకా రెండు మూడేళ్ల కన్నా ఎక్కువ సాగదు అని చెప్పింది. నేను అమ్మని కావాలి.. అందుకే యాక్టింగ్ తో పాటు అన్నింటికి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్టింగ్ కి బ్రేకిచ్చాక నా పాపే నా ప్రపంచం అని ఓపెన్ గా చెప్పేసింది.

మరి ఉన్నట్లు ఉండి సమంత ఇలా మాట్లాడిందేంటి అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అక్కినేని ష్యామిలీ పిల్లల కోసం సమంతను చేస్తున్న ఫోర్సేనని ఫిల్మ్ సర్కిల్స్ గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లయ్యి నాలుగైదేళ్లు అయితే ఇక ఇంట్లో వాళ్లు ఎలానూ ఊరుకోరు. పిల్లలు లేకపోతే ఒత్తిడి అంతే ఇదిగా ఉంటుంది. ప్రస్తుతం సామ్ పరిస్థితి అలానే ఉందట. అందుకే సమంత ఈ నిర్ణయం తీసుకుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాలో బిజీ అవుతే వ్యక్తిగత జీవితం జీరో అయిపోతుందన్న బెంగా సమంతను వెంటాడుతోందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -