Thursday, April 25, 2024
- Advertisement -

‘ఆచార్య’లో మూవీలో మహేష్ లేడట.. ఎందుకంటే ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రంగా ‘ఆచార్య’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీలో మహేష్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త బాగా వైరల్ అయింది. మహేష్ బాబు 30 రోజుల పాటు ఆచార్య చిత్రం కోసం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని వార్త రావడంతో అంచనాలు భారీ స్థాయికి వెళ్ళాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్యలో మహేష్ బాబు లేడు. మొదట అనుకున్నట్లుగానే లాభమో నష్టమో రామ్ చరణ్ తోనే చేయించాలని నిర్ణయించారట. మహేష్ బాబు 30 రోజులకు ఏకంగా 30 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. 30 కోట్ల పారితోషికం ఆయనకు ఇస్తే సినిమా బడ్జెట్ శృతి మించుతుందనే ఉద్దేశ్యంతో ఆయనను దూరం పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.

మెగాస్టార్ తో రామ్ చరణ్ నటించినా కూడా సినిమాకు ఖచ్చితంగా భారీ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఆ కారణంగానే మహేష్ బాబు లేకున్నా పర్వా లేదని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. ఎలాగో మూవీ బడ్జెట్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని భావించి బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని మహేష్ ను పక్కన పెట్టినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది మహేష్ ఫ్యాన్స్ కి కాస్త చేదు వార్తే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -