రేణు దేశాయ్ హీరోయిన్ గా కంటే పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకోవడం వల్ల ఎంతో ఫేమస్ అయింది. ఆ తర్వాత తమ మధ్య అభిప్రాయభేదాలు రావడంతో పవన్, రేణు ఇద్దరు విడిపోయారు. దాంతో పవన్ కళ్యాణ్ అన్నా లేజినోవాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాతో ప్రేమాయణం నడపడం, సంతానాన్ని కనడమేమని రేణూ దేశాయ్ గతంలో చాలా సార్లు బహిరంగంగానే చెప్పింది.
పవన్ తో విడిపోయిన తర్వాత రేణు తన ఇద్దరు పిల్లలతో పూణేలో ఉంది. ఈ మధ్యే హైద్రాబాద్కు షిఫ్ట్ అయిందని తెలుస్తోంది. అయితే రేణు దేశాయ్ పవన్ తో విడిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆ టైంలో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఎంతటి విధ్వంసం చేశారో అందరికి తెలిసిందే. రెండో పెళ్లి చేసుకోవద్దని అందరూ హెచ్చరించారు. అయితే పవన్ మరో పెళ్లి చేసుకుంటే ప్రశ్నించలేరు.. నన్ను ఎందుకు ప్రశ్నిస్తారని వారిపై రేణు ఫైర్ అయింది.
అయితే రేణూ దేశాయ్ రెండో పెళ్లికి అంతా సిద్దమైంది. కానీ తనకు కాబోయే శ్రీవారి గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పడం లేదు. బయటకు చెబితే పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారనో ఏమో గానీ ఇప్పటి వరకు ఆ విషయాలేవీ ఎవ్వరికీ తెలీదు. అయితే నిశ్చితార్థం అయిందని మాత్రం క్లారిటీ ఇచ్చింది. తాజాగా రేణూ దేశాయ్ తన షూటింగ్లో నిమగ్నమైంది. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె మెడకు నల్లపూసలు కనిపించడంతో అంతా పెళ్లి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆమె షూటింగ్లో భాగంగా వాటిని ధరించిందా? లేదా నిజంగానే పెళ్లి అయిందా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
సమంతను పూజా హెగ్డే అంత మాట అన్నదా ?
లవ్ మ్యారేజ్ కు ఇంట్లో ఒప్పుకోలే.. నా భర్త మీదా డౌట్ : యాంకర్…