కరోనాతో పోరాటంకు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు తమవంతుగా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ముందు వస్తున్నారు. అయితే గత వారంగా సోషల్ మీడియాలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి 250 కోట్ల విరాళంను ప్రకటించాడనే వార్త బాగా హల్ చల్ అయింది.
అయితే ఈ విషయంపై ఎక్కడ కూడా అధికారికంగా న్యూస్ లేదు. అలానే అమీర్ ఖాన్ కూడా తన సోషల్ మీడియాలో ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడలేదు. దాంతో ఈ విషయంలో నిజం అనేది ఎంతవరకు అని ఎంక్వౌరీ చేయగా అసలు విషయం తెలిసింది. ఇది కేవలం పూకారని.. ఇందులో నిజం లేదని తేలింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒకటి ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అబద్దమని.. మోడీని అమీర్ కలవలేదని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు, ఫోటోలు అయిదు సంవత్సరాల క్రితం మోడీని ఆమీర్ కలిసిన సందర్బంగా తీసినవిగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనాపై యుద్దంకు ఆమీర్ విరాళంను ప్రకటించలేదు. బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ మాత్రమే 25 కోట్ల భారీ విరాళం ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు.