Thursday, April 25, 2024
- Advertisement -

జబర్దస్త్ పని అయిపోయింది.. అందరూ జంప్..!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై గత 8 సంవత్సరాలుగా జబర్దస్త్ షో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ పరిచయం అయ్యారు. అందరు సినిమాల్లో నటిస్తూ, ఇటూ జబర్దస్త్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా జబర్దస్త్ ఫ్యామిలీ బ్రేక్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ డైరెక్టర్ నిఖిల్ తో మల్లెమాల వారికి పారితోషికం విషయంలో చెడిందని.. ఆ కారణంగానే నిఖిల్ జీ తెలుగును ‘గ్యాంగ్ స్టర్స్’ అనే కామెడీ షో కాన్సెప్ట్ తో సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

నిఖిల్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో జీ తెలుగు వారు నాగబాబుకు భారీ పారితోషికం ఆఫర్ చేసి ఆహ్వానించారట. నాగబాబుతో పాటు అనసూయ.. సుడిగాలి సుధీర్ టీం.. హైపర్ ఆది టీం ను కూడా భారీ పారితోసికం ఆఫర్ చేసి ఆహ్వానించారట. అయితే ఇది ప్రచారం కాదని వాస్తవమే అంటూ క్లారిటీ ఇచ్చారు జబర్దస్త్ కమెడియన్స్ చమ్మక్ చంద్ర. ’జబర్దస్త్ ఆగిపోలేదు. జబర్దస్త్ నుంచి నాగబాబు గారు బయటకు వచ్చిన మాట నిజమే. ఆయనతో పాటు కొన్ని టీంలు కూడా బయటకు వచ్చాయి.

నేను కూడా బయటకు వచ్చాను. కొన్ని నెలల తర్వాత మళ్లీ వెళ్లొచ్చేమో చెప్పాలేం. జబర్దస్త్ మాకు లైఫ్ ఇచ్చింది. కాకపోతే చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం అంతే. నాగబాబు స్థానంలో జడ్జ్‌గా అలీగారు వెళ్లారు. అడ్జెస్ట్‌మెంట్ కోసం.. మళ్లీ నాగబాబు గారు జబర్దస్త్ షోకి వెళ్లొచ్చు’ అంటూ అసలు విషయాన్ని’ బయటపెట్టాడు చమ్మక్ చంద్ర.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -