Friday, March 29, 2024
- Advertisement -

16 ఏళ్లకే ప్రేమలో పడ్డా.. తొమ్మిదేళ్లు పొరాడాను : అనసూయ

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ లాక్ డౌన్ లో ప్రేక్షకులతో ముచ్చటిస్తోంది. ఇంట్లోనే ఉండి వంటలు బాగా నేర్చుకున్నానని పిల్లలకు రకరకాల వంటకాలను చేసి పెట్టినట్టు తెలిపిన ఆమె తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. తన ఫస్ట్ క్రష్ 16 ఏళ్లకే మొదలైందని అన్నారు అనసూయ. వేరే వాళ్లపై క్రష్ ఏర్పడేటంత టైం తన భర్త ఇవ్వలేదని 16 ఏళ్లకే తనపై కర్చీఫ్ వేశాడని తన భర్త సుశాంత్ భరద్వాజ్‌‌తోనే ఫస్ట్ క్రష్ అంటూ తన లవ్ స్టోరీ చెప్పారు అనసూయ.

తమ వివాహ బంధానికి పదేళ్లు అని గుర్తు చేసుకున్న అనసూయ తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ఎన్ సీ సీలో అతన్ని చూశాను.. అప్పటికీ ప్రేమ అంటే ఏంటో తెలియదు. కానీ ఒకర్ని ఒకరు అర్దం చేసుకున్నాం. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇంట్లో ఒప్పుకోలేదు. అయినప్పటికి నన్ను ఎంబీఏ మా ఆయనే చదివించారు. వాళ్ల అన్నయ్య యూకే నుంచి పంపిన మొబైల్ ని అమ్మేసి ఫీజ్ లు కట్టాడు. నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను. మధ్యలో రెండుసార్లు హేయ్ పదా పెళ్లి చేసుకుందా అన్న ఆయన ఒప్పుకోలేదు. పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకుందాం అనేవారు.

అలా తొమ్మిదేళ్లు వేచి చూసి మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇక ఇండస్ట్రీకి వచ్చిక కూడా సపోర్ట్ చేశారు. ప్రతిదీ ఆలోచించే ఇద్దరం నిర్ణయం తీసుకుంటాం. మధ్య మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. మేమైతే ప్రతివారం విడాకులు తీసుకుంటాం (ఫన్నీగా నవ్వుతూ).. ఒకరి గురించి ఒకరు కంప్లైంట్స్ ఉండవు కాని.. ఎప్పుడూ థర్డ్ పర్శన్ గురించే గొడవలు వస్తుంటాయి. వాటి నుంచి వెంటనే రియలైజ్ అవుతుంటాం. ఆ తరువాత ముందు మన ఇద్దరం.. ఆ తరువాతే ఎవరైనా అని అనుకుంటాం దాంతో గొడవలు వచ్చినట్టే పోతుంటాయ్ అని అనసూయ చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -