బుల్లితెరపై చాలా బిజీ ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. జబర్దస్త్, ఢీ షోలు చేస్తూనే సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటాడు సుధీర్. అయితే ఈ కమెడియన్ ప్రస్తుతం కరోనావైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయనకు కోవిడ్ పాజిటివ్ అనే విషయాన్ని సన్నిహితులు ధృవీకరిస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. లాక్ డౌన్ తర్వాత జబర్దస్త్, ఢీ షో షూటింగ్ జరుగుతున్నాయి. అయితే ఆదివారం అంటే అక్టోబర్ 18వ తేదీన సుధీర్కు కరోనా పాజిటివ్ అని తేలిందనే విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో సుధీర్ ఉన్నారు. అయితే అక్క ఎవడే అతగాడు అనే స్పెషల్ షో కోసం సుధీర్ సుడిగాలి షూటింగులో పాల్గొన్నారు. దసరా పండుగ కోసం షూట్ చేసిన ఈ షోలో రాంప్రసాద్, రష్మీ గౌతమ్ పాల్గొన్నారు. ఈ షో అక్టోబర్ 25వ తేదీన ప్రసారం కానున్నది.
సుడిగాలి సుధీర్కు కరోనా సోకినట్లయితే.. గత కొద్ది రోజులుగా ఆయన పాల్గొన్న షూటింగ్స్ యూనిట్ కూడా రిస్క్లో పడినట్టే అనే మాట వినిపిస్తున్నది. తనతోపని చేసిన వాళ్లందరూ రోగ నిర్దారణ పరీక్షలు చేయించుకోవడం, స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తున్నది.
జై చిరంజీవ నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?
అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?