Thursday, March 28, 2024
- Advertisement -

రోజా ముందే జగన్ పై పంచ్ వేసిన గెటప్ శ్రీను..!

- Advertisement -

ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న విషయాలపై పంచులు వేయడంలో జబర్దస్త్ ఎప్పుడు ముందు ఉంటుంది. గతంలో ఇలాంటి పంచులు హైపర్ ఆది ఎక్కువగా వేశేవాడు. అయితే తాజాగా ఓ ఎపిసోడ్ లో జడ్జి రోజాపైనే గెటప్ శ్రీను వేసిన పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా గెటప్ శ్రీను వివాదాల జోలికి పెద్దగా వెళ్లడు. అయితే డిసెంబర్ 6న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో గెటప్ శ్రీను వేసిన పంచ్ కు జడ్జి స్థానంలోని రోజా షాక్ తిన్నట్లు సమాచారం. స్కిట్ లో భాగంగా గెటప్ శ్రీను రాత్రి బస్సు ఎక్కి ఊరెళ్లాను అంటాడు. అందుకు రోజా ఎర్రబస్సు ఎక్కావా అంటూ పంచు వేసింది. అందుకు గెటప్ శ్రీను రివర్స్ లో పంచ్ వేస్తూ.. ఈ మధ్య కాలంలో బస్సుల కలర్ మార్చేశారు అంటూ పంచ్ వేశాడు. దాంతో జడ్జి రోజా నోట మాటరాలేదు.

అక్కడ ఉన్నావారంత షాక్ అయ్యారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యలయాలు, పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ జెండా రంగులను వేస్తోందని ఆరోపణలు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నాయి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను పంచ్ వేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -