లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కాజల్.ఈ సినిమా వచ్చి 10 సంవత్సరాలు దాటిని ఇప్పటికి వరస సినిమాలు చేస్తు బిజీగా ఉంది కాజల్.తెలుగు ,తమిళ్,హిందీ భాషలలో సినిమా చేసింది.ప్రస్తుతం ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన హీరోయిన్గా నటిస్తుంది.తాజాగా ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ తరం కథనాయికలు నయనతార,అనుష్క, త్రిషలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి మెప్పించారు.
ఈ నేపథ్యంలో తాను కూడా ఈ తరహా సినిమాలు చేయాలని కాజల్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.దర్శకుడు భానుశంకర్ ఇటీవల కాజల్ ను కలిసి ఒక లైన్ వినిపించాడట. లైన్ బాగుందని చెప్పిన కాజల్ .. పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేసుకుని రమ్మని చెప్పిందట. ఆ దర్శకుడు కథపై కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. కథ నచ్చితే కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని ఆమె సన్నిహితులు తెలుపుతున్నారు.