Wednesday, April 24, 2024
- Advertisement -

కంగనాకు అవమానం.. సెల్ఫీల కోసం అలా చేశారు..!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేంచి చెప్పనక్కర్లేదు. ఈ హీరోయిన్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ఎక్కడికి వెళ్లిన వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. దాంతో ఆమె దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. విషయంలోకి వెళ్తే.. చాలా సార్లు కంగనా ఇతర సెలబ్రిటీలపై రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.

గతంలో హృతిక్‌తో గొడవ.. అలానే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితోనూ గొడవ పడింది. ఈ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత ప్రవర్తనతోనే కాకుండా.. సినిమాల పరంగానూ వివాదాస్పదం అవుతోంది. ఆమె ఎంచుకునే సినిమాలు సున్నితమైన కథల ఆధారంగా తెరకెక్కుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే చాలా సార్లు ఆమె ఈ తరహా వివాదాలను ఎదుర్కొన్నారు.

దీంతో కంగనా సినిమాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోతున్నాయి. తాజాగా ఆమె మాజీ సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ అనే మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె టైటిల్ రోల్ చేస్తోంది. తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. దీనికి చూసేందుకు వచ్చిన పలువురు వ్యక్తులు కంగనాతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారట. దీంతో ఆమెకు చిరాకు వచ్చి బ్లాంకెట్లు అడ్డు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు. గతంలో తాను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనలేదని అసహనం వ్యక్తం చేసిందట ఈ స్టార్ హీరోయిన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -