కంగనా రనౌత్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అలానే ఫైర్ బ్రాండ్ గా కూడా పేరు తెచ్చుకుని ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మందితో కంగనాకు గొడవలు ఉన్నాయి. ఐతే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ లోని నెపోటిజం పై తీవ్ర విమర్శలు రేగాయి.
సోషల్ మీడియా వేదికగా కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్, కరీనా కపూర్ వంటి వారిపై నెటిజెన్స్ దారుణంగా విరుచుకుపడ్డారు. దాంతో కంగనా కామెంట్స్ కు బలం చేకురింది. దీనితో ఆమె విమర్శల దాడి మరింతగా పెంచారు. ఇక హీరోయిన్ తాప్సితో కొద్దిరోజుగా యుద్ధం చేస్తున్న కంగనా తాజాగా టాప్ స్టార్స్ రణబీర్ సింగ్, దీపికలపై దారుణమైన కామెంట్స్ చేసింది. రణబీర్ గురించి కంగనా మాట్లాడుతూ.. ఎప్పుడూ అమ్మాయిల వెనుకబడే రణబీర్ ని ఎవరు రేపిస్ట్ అని పిలవరు అన్నారు.
అలాగే దీపికా పదుకొనె తనకుతానే మానసిక రోగినని ప్రకటించుకున్నారు. అయినప్పటికి ఆమెను సైకో అని ఎవరూ పిలవరు. కానీ చిన్న కుటుంబాల నుండి, నగరాల నుండి వచ్చిన వారిని మాత్రం అనేక విధాలుగా దూషిస్తున్నారు అన్నారు. ఈ స్టార్స్ పై కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. కొందరు కంగనా వ్యాఖ్యలను సమర్దిస్తుండగా, మరికొందరు కొట్టిపరేస్తున్నారు.
నటి రమప్రభ అల్లుడు తెలుగు హీరో అని మీకు తెలుసా ?
నాతో తిరిగిన వాళ్లే నన్ను తేడా అని అవమానించారు : జబర్దస్త్ పవన్
రానా, మిహీకా మెహిందీ ఫంక్షన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ఎంతంటే ?