Saturday, April 20, 2024
- Advertisement -

ఆ సినిమా లో కీర్తి చనిపోతుందా?

- Advertisement -

మన్మధుడు సినిమా తెలుగు సినిమా చరిత్ర లో ఒక కల్ట్ క్లాసిక్ సినిమా లాగా మిగిలిపోతుంది. అయితే ఈ సినిమా ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయగా, విజయ్ భాస్కర్ దర్శకత్వం చేశారు. నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రలలో నటించగా, సునీల్ బ్రహ్మానందం ముఖ్య పాత్ర లు పోషించి అందరినీ మెప్పించారు. ఈ సినిమా కి ఇప్పుడు రెండో భాగం వస్తుంది అంటుంటే నే చాలా మందికి భయం వేస్తుంది. ముఖ్యం గా మన్మధుడు ఒరిజినల్ ఫాన్స్ అసలు ఈ సినిమా కి రెండు భాగం వస్తుంది అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా త్రివిక్రమ్ లేకుండా, సునీల్, బ్రహ్మానందం లేకుండా ఈ సినిమా అంటే ఊహించుకోలేము.

అయితే ఈ సినిమా లో ప్రస్తుతం సమంత ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా మనకి కనిపిస్తుంది. అందరికీ సర్వప్రయిజ్ ఇచ్చే వార్త ఏంటి అంటే ఈ సినిమా లో కీర్తి సురేష్ ఒక కీ రోల్ చేస్తుంది. కీర్తి సురేష్ సినిమా ఒప్పుకుంది అంటే కచ్చితంగా అది ముఖ్య పాత్ర నే అయ్యి ఉంటుంది. కాకపోతే ఈ సినిమా లో కీర్తి పాత్ర మన్మధుడు లో అన్షు పాత్ర లాగా అర్ధాంతరం గా వచ్చి వెళ్ళిపోతుంది అని, కీర్తి ఈ సినిమా లో చనిపోతుంది అని రూమర్స్ వస్తున్నాయి.

అయితే నిజంగా కీర్తి అలాంటి పాత్ర చేస్తుందా లేక ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర చేస్తుందా అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -