Wednesday, April 24, 2024
- Advertisement -

కంగనతో గొడ‌వ‌ప‌డి షూటింగ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన క్రిష్‌?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు క్రిష్ ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు.తెలుగులో బాల‌కృష్ట హీరోగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నాడు క్రిష్‌.ఇక బాలీవుడ్‌లో కంగన రనౌత్ లీడ్ రోల్‌లో మ‌ణిక‌ర్ణిక‌ను తీస్తున్నాడు క్రిష్. ఈ రెండు సినిమాల‌కు ఏక‌కాలంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు క్రిష్.అయితే కంగన రనౌత్‌కు క్రిష్‌కు మ‌ధ్య గొడ‌వ‌ల‌ని గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

క్రిష్ ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాకు ఎక్కువ రోజులు కేటాయించ‌డంతో కంగన చాలా కోపంతో ఉంద‌ని స‌మాచారం.ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌న్నా కంగ‌న మ‌ణిక‌ర్ణిక‌ను ముందు మొద‌లు పెట్టాడు క్రిష్.కాని బాల‌కృష్ట కోరిక మేర‌కు క్రిష్ ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాకు అంగీక‌రించాడు. ఈ సినిమాను జ‌న‌వ‌రిలో విడుద‌ల చేస్తామ‌ని బాల‌కృష్ట తెలిపాడు.ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు స‌మ‌స్య మ‌ణిక‌ర్ణిక సినిమా కూడా రిపబ్లిక్ డేన విడుద‌ల చేయ‌ల‌ని మొద‌ట భావించారు.కాని క్రిష్ ఎన్టీఆర్ సినిమా ఎక్కువ ప్రాథన్య‌త ఇస్తు మ‌ణిక‌ర్ణిక‌ను లైట్ తీసుకున్నాడ‌ని భావించిన కంగ‌నా షూటింగ్‌లో క్రిష్‌తో గొడ‌వ ప‌డింద‌ని తెలుస్తుంది.

దీంతో క్రిష్‌ కోపంతో షూటింగ్ నుంచి వ‌చ్చేశార‌ట‌.ఈ సినిమాకు మ‌రో ద‌ర్శ‌కుడిని పెట్టుకోవ‌ల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ట కంగ‌న.మ‌రి ఈ వివాదం ఎక్క‌డికి వెళ్లుతుందో చూడాలి.`మణికర్ణిక` ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -