Tuesday, April 16, 2024
- Advertisement -

మహేష్ బాబు.. విజయ్ దేవరకొండ.. పరశురామ్.. గీత ఆర్ట్స్ ?

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో పెద్ద నిర్మాతలు దర్శకుల చూపు మహేష్ బాబు మీద పడింది. మహర్షి విజయం తో మంచి ఊపు మీద ఉన్న మహేష్ తో సినిమా చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అనే నమ్మకం తో ఉన్నారు అందరూ. అయితే ప్రస్తుతం మహేష్ ముందు ఉన్న ఏకైక కన్ఫర్మ్డ్ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో త్వరలో మొదలు కానుంది. ఇది పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగా,త్రివిక్రమ్ శ్రీనివాస్, పరశురామ్ మహేష్ తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారు. మరో పక్క గీత ఆర్ట్స్ కూడా మహేష్ తో సినిమా చేయాలనీ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

తాజాగా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న రూమర్ ప్రకారం పరశురామ్ మహేష్ బాబు ని ఒక కథ చెప్పి ఒప్పించాడట. గీత ఆర్ట్స్ బానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమా ని నిర్మిస్తాడట. అయితే ఈ సినిమా లో విజయ్ దేవరకొండ కూడా ఉండనున్నారు అనే టాక్ నడుస్తుంది. విజయ్-పరశురామ్ కాంబినేషన్ లో గీత గోవిందం పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చనువు తో నే విజయ్ ని కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసాడట దర్శకుడు.

అయితే కొద్దీ రోజులు ఆగితే కానీ ఈ రూమర్ లో ఎంత వరకు నిజం ఉందొ మనకి తెలియదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -