Thursday, March 28, 2024
- Advertisement -

సరిలేరు నీకెవ్వరుకు మహేష్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా ’సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతో మహేష్ మరోసారి ఆల్ టైమ్ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ తో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారట.

అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా అని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీకి మహేష్ బాబు భారీ మొత్తంలో పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ ను తన రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు.

అయితే ఇటీవలే సన్ టీవి శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జాయింట్ గా .30 కోట్లకు తీసుకున్నారు. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 15 కోట్లకు డీల్ కుదిరింది.ఇతర రైట్స్ విలువ కూడా మరో కోటి వరకు ఉంటాయట.ఇవన్నీ కలిపితే 46-47 కోట్లకు చేరుతుంది. కాగా జీఎస్టీని మినహాయిస్తే రూ. 41 కోట్లు మహేష్ రెమ్యునరేషన్‌గా మిగులుతుంది.

మహేష్ బాబు కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ గా తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -