మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తనీ ఒరువన్ రీమేక్ ధృవ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యేలోపే మరో సినిమాని లైన్లో పెడుతున్నాడు చరణ్. ఆ సినిమాకి సంబంధించి టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఆ టైటిల్ మరేదో కాదు..’మెగా ఎక్సప్రెస్’.
సందీప్ కిషన్ తో తొలి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు మేర్లపాక గాంధీ దశమారిపోయింది. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు రెండో సినిమాను శర్వానంద్ తో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తన మూడో సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీయబోతున్నాడు.
ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ధృవ చేస్తున్న రామ్ చరణ్… నవంబర్ నుంచి సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండింటి తర్వాత వరుసగా రెండు లవ్ స్టోరీలు చేయాలని అనుకుంటున్నాడట చరణ్. వీటిలో ఒకటి మేర్లపాక గాంధీతో చేయనున్నాడని.. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అయిపోగా.. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
Related