Friday, March 29, 2024
- Advertisement -

శ్రీముఖికి అవమానం జరిగిందా ?

- Advertisement -

శ్రీముఖికి అవమానం జరగడం ఏంటి అనుకుంటున్నారా ? విషయంలోకి వెళ్తే.. ఇక తాజాగా తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఈ సీజన్ లో విన్నర్ గా రాహుల్ గెలిచాడు. దాంతో అతని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాహుల్ ముందు నుంచి తన గేమ్ తానూ ఆడుతూ వస్తున్నాడు. అయితే హౌస్ లో ఎవరితో ఎక్కువ గొడవ పడని రాహుల్ తో శ్రీముఖి గొడవ పడేది. అందుచేత శ్రీముఖి చేష్టలు ప్రేక్షకులకు నచ్చలేదు.

దాంతో శ్రీముఖి, రాహుల్ గొడవ విషయంలో తప్పు శ్రీముఖిదే అని జనాలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. దాంతో రాహుల్ కు బాగా సింపతీ వర్క్ వట్ అయింది. నిజం చెప్పాలంటే రాహుల్ కి బిగ్ బాస్ కి రాకముందు ఎక్కువ క్రేజ్ లేదు. అసలు అతను గెలుస్తాడు అని కూడా ఎవరు అనుకోలేదు. శ్రీముఖి హౌస్ లోకి వస్తుంది అని తెలియడంతో ఆమెనే ఈ సారి విన్నర్ గా గెలుస్తుంది అని అనుకున్నారు.

ఎందుకంటే ఆమెకి ఆ రేంజ్ క్రేజ్ ఉంది. కానీ ఎవరు ఊహించని విధంగా రాహుల్ హౌస్ లోకి రావడం వాళ్ళ ఎక్కువ క్రేజ్ వచ్చింది. అయితే దాంతో శ్రీముఖి కంటే ఎక్కువ ఓట్లు గెల్చుకుని బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ గా గెలిచాడు. శ్రీముఖి చేసిన అతి వల్లే ఆమె ఓడిపోయింది అని కొందరు అంటుంటే.. శ్రీముఖి గెలవాల్సింది. ఆమెకి అన్యాయం జరిగింది అని మరి కొందరు అంటున్నారు. రాహుల్ ఎప్పుడు కెప్టెన్ కూడా కాలేదు. బద్ధకస్తుడు అలాంటి వ్యక్తి ఎలా గెలిచాడో అని శ్రీముఖి ప్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇదే విషయం పై కత్తి మహేష్ స్పందించాడు. ‘బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3 వరుసగా బిగ్ బాస్ షో ప్రతిష్ఠని దిగజార్చే ఫైనల్ రిజల్ట్స్‌తో ముందుకు వెళ్లాయి. బహుశా మన జనబాహుళ్యం మీద కూడా అదొక రిఫ్లేక్షన్ కావచ్చు’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలారు. సో ఏది ఏమైనా ప్రజల ఓట్లే తుది తీర్పు కాబట్టి.. రాహుల్ ప్రజలను మెప్పించడం లో సక్సెస్ అయ్యాడు. అందుకే అతను గెలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -