Friday, March 29, 2024
- Advertisement -

నాకు బిస్కెట్లు వేయకు : అవినాశ్ కి నాగబాబు వార్నింగ్

- Advertisement -

గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ పరిచయం అయ్యారు. అందులో కొందరు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. కొందరు హీరోలు కూడా అయ్యారు. అయితే మధ్యలో జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అవ్వడంతో షోని ఆపేయాలని రచ్చ జరిగిన కానీ జబర్దస్త్ ఆగలేదు. ప్రస్తుతం బుల్లితెరపై సక్సెస్ ఫుల్ షోగా టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది.

అయితే ఈ మధ్య ఈ షో లో టీం లీడర్స్ కి యాజమాన్యానికి జడ్జీస్ కి మధ్య కొన్ని విభేదాల కారణంగా నాగబాబు సహ మరి కొంత మంది మరో ఛానెల్ లో వస్తున్న అదిరింది షోకి వెళ్లిపోయారు. ఇప్పుడు జబర్దస్త్ లో రోజా జడ్జీగా ఉన్నారు. మరికొంతమంది టీం లీడర్స్ అలానే కొనసాగుతున్నారు. ఇక జబర్దస్త్ బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో అవినాశ్ ఒకరు. ఎన్టీఆర్ .. ఎన్నార్ .. కృష్ణ .. సాయికుమార్ వంటివారిని ఎక్కువగా అనుకరిస్తూ నాన్ స్టాప్ గా నవ్వించడం అవినాశ్ ప్రత్యేకత. అలాంటి అవినాశ్ కి తాజాగా నాగబాబు నుంచి ఒక వార్నింగ్ లాంటి పంచ్ పడింది.

నాగబాబు తన యూ ట్యూబ్ చానల్లో లైవ్ చాట్ చేస్తూ ఉండగా, టచ్ లోకి వచ్చిన అవినాశ్, ‘నేను మాట్లాడుతున్నది వరుణ్ తేజ్ తోనా? నాగబాబుగారితోనా? అర్థం కావడం లేదు’ అన్నాడు. ఆ మాటకి నాగబాబు స్పందిస్తూ .. ‘అరేయ్ .. నేనిప్పుడు ‘జబర్దస్త్’ చేయడం లేదు .. నాకు బిస్కెట్లు వేయడం వలన నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వెళ్లి శేఖర్ మాస్టర్ కో .. రోజాకో వేసుకో .. ఉపయోగం ఉంటుందేమో’ అన్నారు. తనకు ఎవరి మీదా పగ ప్రతికారాలు ఉండవి.. ఎవరి అవకాశాలు వారివేనని లైవ్ చాట్ లో నాగబాబు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -