Friday, March 29, 2024
- Advertisement -

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

- Advertisement -

సుశాంత్ సింగ్ ది హత్యా ? ఆత్మహత్యా ? అనే అనుమానాల మొదలై చివరకు ఆ విషయం డ్రగ్స్ వద్దకు చెరింది. డ్రగ్స్ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అరెస్ట్ అయింది. విచారణలో భాగంగా మరికొందరి స్టార్స్ పేర్లు ఆమె బయట పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ సహా కొందరికి సమన్లు జారీ చేయనున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు.

బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత పేరు కూడా వుందని ముంబై మీడియా వర్గాలు చెబుతున్నారు. ఆమెకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు టాలెంట్ మేనేజర్ జయ సాహా వాజ్ఞ్మూలం ఇచ్చారట. ఎన్‌సిబి దర్యాప్తులో జయ సాహా, నమ్రత చాటింగ్ చేసుకున్నట్టు బయటకు వచ్చింది. ఒక జాతీయ ఛానల్ డ్రగ్ సప్లయర్లు, సెలబ్రిటీల మధ్య జరిగిన ఛాటింగ్ ను లీక్ చేసింది. అందులో ‘ఎన్’ అని ఒకరితో ఉన్న ఛాటింగ్ నమ్రతతో చేసిందని భావిస్తున్నారు.

డ్రగ్స్ కోసం జయ సాహాతో నమ్రత ఛాటింగ్ చేసినట్టు ఎన్‌సిబి వర్గాలు వెల్లడించాయట. తనకు డ్రగ్స్ కావాలని నమ్రత అడిగారట. ‘ముంబైలో మంచి ఎండి ఇస్తానని ప్రామిస్ చేశావ్. ఇచ్చాక పార్టీ చేసుకుందాం’ అని నమ్రత మెసేజ్ చేశారట. నమ్రత పేరును నేషనల్ మీడియా ప్రముఖంగా పేర్కొంటోంది. ఇప్పటివరకు అయితే నమ్రత పేరును ఎన్‌సిబి చెప్పలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, దియా మీర్జా పేర్లు సైతం బయటకొచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -