Friday, April 19, 2024
- Advertisement -

డ్రగ్స్ కేసులో నమ్రత కూడా.. ఇదే ప్రూఫ్..?

- Advertisement -

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం దేశంలో ఉన్న డ్రగ్స్ మాఫియా ని బయటపడేలా చేసింది.. అసలు డ్రగ్స్ దేశంలో ఇంతలా వ్యాపించిందా అనే రేంజ్ లో అవాక్కవుతున్నారు ప్రజలు.. రోజుకో పేరు బయటకు వస్తూ ఆడారు షాక్ అయ్యేలా చేస్తుంది ఈ డ్రగ్స్ కేసు.. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు భార్య, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ తో పాటు నటి దియా మీర్జా పేర్లు కూడా ఈ లిస్టులో వున్నట్టు జాతీయ మీడియా ప్రసారం చేయడం కలకలం రేపింది.

ఈ ఆరోపణలను నమ్రత టీమ్ ఖండించినప్పటికీ, సుశాంత్ సింగ్ మీడియా మేనేజర్ జయా సాహాతో ఆమె చాటింగ్ చేసినట్టు స్పష్టమైన ఆధారాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంపాదించింది. అవి డ్రగ్స్ కు సంబంధించినవా? కావా? అన్న విషయమై మాత్రం సమాచారం లేదు. కోడ్ భాషలో ఉన్న ఒక్కో అక్షరాన్నీ డీ కోడ్ చేస్తున్న అధికారులు, రోజుకో పేరును బయటకు తీస్తున్నారు. ఎన్ అంటే నమ్రత అని, డీ అంటే దీపికా పదుకొనే అని, కే అంటే దీపిక మేనేజర్ కర్మిష్మా అని, జే అంటే జయా సాహా అని, ఎస్ అంటే శ్రద్ధా కపూర్ అని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ చాటింగ్స్ లో నమ్రతతో పాటు జయ, దీపిక, కరిష్మా తదితరులు పాల్గొన్నట్టు నిర్ధారించుకున్న అధికారులు, ప్రస్తుతం మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇక డ్రగ్స్ కేసులో నమ్రత పేరు బయటకు రావడం టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. అన్ని టీవీ చానెళ్లు, మీడియా సంస్థలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. మూడేళ్ల క్రితం టాలీవుడ్ లో బయటకు వచ్చిన డ్రగ్స్ కేసును ఇప్పుడు బాలీవుడ్ కేసుతో పోలుస్తూ కథనాలు వెలువడుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య తరువాత అరెస్ట్ అయిన రియా చక్రవర్తి, విచారణలో భాగంగా రాకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా చెప్పినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో నమ్రత మాట్లాడినట్టుగా ఉన్న ఓ ఆడియో టేప్ కూడా అధికారుల వద్ద ఉన్నట్టు సమాచారం.

కాగా, అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఎన్, జే మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఇదే..

ఎన్: ముంబైలో మంచి ఎండీ ఇస్తానని గతంలో హామీ ఇచ్చావు. నేను వచ్చినప్పుడు ఇవ్వాలి. నాకు బ్రేక్ కావాలి. మనం మంచి పార్టీ చేసుకుందాం.

జే: నన్ను డ్రగ్స్ అమ్మకందారుగా చేస్తున్నావు. అయినా సరే.. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -