Thursday, April 25, 2024
- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్ లో చీలికలు?

- Advertisement -

శ్రీమంతుడు అనే సినిమా తో మైత్రి మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థ తెలుగు లోకి అడుగు పెట్టింది. మొదటి చిత్రం తో నే భారీ బ్లాక్బస్టర్ నిర్మించి అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కూడా భారీ బడ్జెట్ సినిమాలని నిర్మించి త్వరితగతిన విజయం, డబ్బులు సంపాదించి ఇప్పుడు తెలుగు లో టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటి గా పేరు గడించింది. అయితే ఈ నిర్మాణ సంస్థ కి సారథులు ముగ్గురు. రవిశంకర్, నవీన్, మోహన్. వీరి ముగ్గురి లో ఎక్కువ గా బయటకు కనిపించేది మాట్లాడేది నవీన్. ఇప్పుడు ఈ నవీన్ సెపరేట్ గా ఒక నిర్మాణ సంస్థ ని లాంచ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడట. తన అభిరుచికి తగ్గట్లు గా తన సొంత నిర్ణయాల తో లిమిటెడ్ బడ్జెట్స్ తో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడట.

అయితే మైత్రి సంస్థ లో చీలికలు వచ్చాయి, అందుకే నవీన్ వేరు కుంపటి పెడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. నవీన్ నిర్మాణ సంస్థ నవీన్ పర్సనల్ గా చూసుకుంటారు. అదే విధం గా యథావిథి గా మిగిలిన ఇద్దరి తో మైత్రి మూవీ మేకర్స్ మీద సినిమాలు మాత్రం ఆప్ ఆలోచన లేదని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -