సింహాలాంటి సినిమా మరోటి వస్తుందేమో. ఎందుకంటే అలాంటి కాంబినేషన్ మళ్లీ రిపీటవుతోంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇన్నాళ్లు పుకార్లు అనుకున్నారు. కానీ ఇది నిజమైంది. ఇటీవల జై సింహా సినిమాతో బాలయ్య తనదైన సినిమాతో వచ్చారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా ఓ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. కన్నడలో శివరాజ్ కుమార్, శ్రీ మురళి, శాన్వీ ప్రధాన పాత్రల్లో నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మఫ్టీ’. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన ‘మఫ్టీ’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాను బాలకృష్ణ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సినిమా గురించి అధికారికంగా త్వరలోనే వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.